అంగారికా టౌన్ షిప్ ఆదాయం 77.37 కోట్ల ఆదాయం
మంగళవారం ఆదాయం 10.05 కోట్ల
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
000000
అంగారికా టౌన్ షిప్ లోని ప్లాట్ లను ప్రత్యక్ష వేలం ద్వారా మంగళవారం వరకు 480 వేలం వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
కరీంనగర్ పట్టణంలోని వాసర గార్డెన్ లో అంగారక టౌన్షిప్ లోని మంగళవారం 60 ప్లాట్లను వేలం వేయగా 10.05 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రత్యక్ష వేలం పాట ద్వారా మంగళవారం వరకు 480 ప్లాట్ లకు వేలం వేయగా కోట్ల 77.37రూపాయలు ఆదాయం వచ్చినదని అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రత్యక్ష వేలం పాటలో అత్యధికంగా చదరపు గజానికి రూ.11600/- మరియు అతి తక్కువ చదరపు గజానికి ధర రూ.6000/- అమ్మడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
కొత్త డీడీలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యక్ష వేలంలో గత వారం రోజుల మిగిలిపోయిన ప్లాట్లను 25 తేదీ నాడు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ ,జీవీ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ ,డిసిపిఓ సుభాష్, తహసిల్దార్ కనకయ్య,ఈ -డిస్టిక్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి,ఏఈ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.