అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారందరూ నూతన ఓటర్లుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు.

అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారందరూ నూతన ఓటర్లుగా నమోదు కావాలని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నూతన ఓటర్లు నమోదు, నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, బోగస్ ఓట్లు తొలగింపు, ఓటరు చిరునామా మార్పు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన, మరణించిన ఓటరు తొలగింపు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేని ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. ఓటరు జాబితా తయారులో ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా ఉండేందుకు ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిదులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒకటే ఇంటి నెంబరులో ఎక్కువ ఓట్లున్న అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లుగా ఉండకూడదని, ఒకే పోలింగ్ ఉండాలని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణలో ఈవియంలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పారు. ఈ నెలలో ఆర్డీఓ కార్యాలయంలో ఈవియంల మొదటి దశ పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని రాజకీయర పార్టీల ప్రతినిధలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. జిల్లాకు 1600 ఈవియంలు ఎన్నికల సంఘం కేటాయించినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో ఎలాంటి పొరపాట్లుకు అవకాశం ఉందని, చాలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. ప్రజలల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్పై అవగాహన కల్పించాలని చెప్పారు. అపనమ్మకం వల్ల ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వస్తుందని చెప్పారు. నివాసాలకు దూరంగా ఉన్నా, 1500 కంటే ఎక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలలో నూతన పోలింగ్ ఏర్పాటుపై రాజకీయ పార్టీలు ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు 153, 157లో ఉన్న ఓటర్లు ప్రస్తుతం అక్కడ నివాసం ఉండటం లేదని రాజకీయ పార్టీలు తెలుపగా ప్రత్యేకంగా విచారణ నిర్వహించి జాబితా తయారు చేస్తామని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సురేష్, సిబ్బంది నవీన్, బిఎస్పీ నుండి జట్టి ఆనందరావు, బిజెపి నుండి నోముల రమేష్, లక్ష్మణ్ అగర్వాల్, కాంగ్రెస్ నుండి శ్రీకాంత్, మధు, సిపియం నుండి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Post