- ఆట్రాసిటి కేసులు త్వరగతిన పూర్తి చేయాలి
– జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. బుదవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు, ఎక్స్గేషియా వివరాలను ఇల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారిణి lదయానందరాణి వివరిస్తూ 2016 నుండి ఇప్పటివరకు 25 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరితగతిన కేసును విచారణ చేసి ప్రాథమికంగా 25శాతం నష్టపరిహారం ఇప్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సివిల్స్ రైట్స్డే నిర్వహించినప్పుడు కమిటి సభ్యులను ఆమ్వానించాలని ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఆర్డివోలు రాజేంద్రకుమార్, వెంకారెడ్డి, కిషోర్కుమార్, సూర్యాపేట డిఎస్పి నాగభూషణం, ఎస్సి కార్పొరేషన్ ఈడి శిరీష, డిటిడిఓ శంకర్, డిఎఫ్ఓ ఉపేందర్ సింగ్ ,ఎస్డిపిఓ వెంకటేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ పీపీ రాథోడ్ సుభాష్ ,అడ్వకేట్ దాచేపల్లి లింగయ్య కమిటీ సభ్యులు వెంకారెడ్డి, సిహెచ్ రాములు, ఎన్ ప్రకాష్బాబు, గూగుల్ అచ్చమ్మ, బుక్కా రవి, ఏ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు..