అధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
అన్నదాతలు అధైర్య పడొద్దని, తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి భరోసాను ఇచ్చారు.
మంగళవారం వేకువ జామున కురిసిన అకాల వర్షానికి కొన్ని చోట్ల ధాన్యం తడిసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతుల్లో నెలకొన్న ఆందోళనను అర్థం చేసుకుని, ప్రభుత్వ ఆదేశాల మేరకు
ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించారు.