అభివృద్ధి పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలోని చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలో జరుగుచున్న అభివృద్ధి పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి
చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన
సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో పంచాయతీరాజ్‌, రోడ్డు-భవనాలు, మిషన్‌ భగీరథ, నీటి పారుదల శాఖల అధికారులు, మున్సిపల్‌ అధికారులు, సoబంధిత శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలో మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా జరుగుచున్న నల్లా కనెక్షన్లు, పైప్‌లైన్‌ పనులపై సoబంధిత అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చి శుద్ధ జలం అందరికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెద్ద చెరువు క్రింద మిగతా పనులను త్వరగా పూర్తి చేయాలని, మొక్కలు నాటి సoరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. దసరా, బతుకమ్మ పండుగ సమీపిన్తున్నందున చెరువు సమీపంలోని శివాలయంకు వెళ్ళే దారి ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా నివాసాల నుండి చెత్తను తడి, పొడి క్రింద వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించాలని, వర్షాకాలం కావడంతో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, మురుగుకాలువలలో పూడిక లేకుండా ఎప్పకటిప్పుడు శుభపర్చాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఈ. ఈ. ప్రకాష్‌, రోడ్డు-భవనాల శాఖ ఈ.ఈ. రాము, మిషన్‌ భగీరథ డి.ఈ.
వెంకటేష్‌, పంచాయతీరాజ్‌ డి. ఈ. స్వామిరెడ్డి, మున్సిపల్‌ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post