ఆజాది కా అమృత్ మహోత్సవ్ – ఇండియా @75 వేడుకల్లో భాగంగా, నల్లగొండ జిల్లాలో నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ 2 న ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువకేంద్ర యువజన అధికారి ప్రవీణ్ సింగ్ తెలిపారు. శనివారం 02-10-2021 న ఉదయం 8:00 గంటలకు స్థానిక ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాల మైదానం నుండి రెడ్ క్రాస్ భవన్ వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ఉంటుంది. దేశ వ్యాప్తంగా 744 జిల్లాలో ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం నెహ్రు యువ కేంద్ర సంఘాటన్ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు ఫిట్ ఇండియా 2k ఫ్రీడమ్ రన్ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా యువత ఫ్రీడమ్ రన్ లో త్రివర్ణ పతాకంతో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువజన సంఘాలు, NSS, NCC, రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
You might also like:
-
*ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యత ఇచ్చి సత్వరం పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్*
-
సాధారణ ఎన్నికలకు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటర్ జాబితాను పారదర్శకంగా సిద్ధం చేయాలని ఓటర్ జాబితా పరిశీలకురాలు శ్రీమతి కె. నిర్మల (ఐఏఎస్) తెలిపారు.
-
మట్టి విగ్రహాలనే ప్రతిష్టిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. అని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.
-
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల నిర్వహణ విధులను సమర్థవంతంగా నిర్వహించుటకు సన్నద్ధం కావాలి: జిల్లా కలెక్టర్:అర్.వి కర్ణన్* *▪️అధికారులు ఎన్నికల విధులపై స్పష్టత కలిగి ఉండాలి* *▪️అర్. ఓ.లు, ఏ.అర్. ఓ.లు,సెక్టార్ అధికారులు,జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు,పోలీస్ అధికారులు,పోలీస్ సెక్టార్ అధికారులకు శిక్షణా కార్యక్రమం*