ఆజాది కా అమృత్ మహోత్సవ్ – ఇండియా @75 వేడుకల్లో భాగంగా, నల్లగొండ జిల్లాలో నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ 2 న ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువకేంద్ర యువజన అధికారి ప్రవీణ్ సింగ్ తెలిపారు. శనివారం 02-10-2021 న ఉదయం 8:00 గంటలకు స్థానిక ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాల మైదానం నుండి రెడ్ క్రాస్ భవన్ వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ఉంటుంది. దేశ వ్యాప్తంగా 744 జిల్లాలో ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం నెహ్రు యువ కేంద్ర సంఘాటన్ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు ఫిట్ ఇండియా 2k ఫ్రీడమ్ రన్ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా యువత ఫ్రీడమ్ రన్ లో త్రివర్ణ పతాకంతో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువజన సంఘాలు, NSS, NCC, రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
You might also like:
-
పత్రికా ప్రకటన. నల్గొండ, Dt:19.05.2022. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఎంతో ప్రాధాన్యత గల నల్గొండ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నందున, ముఖ్యమంత్రి ఆశించిన విధంగా నల్గొండ పట్టణం ను అన్ని విధాలుగా అభివృద్ధి పరచి మోడల్ టౌన్ గా రూపొందించాలని రాష్ట్ర పుర పాలన,పట్టణ అభివృద్ధి శాఖ సంచాలకులు సత్యనారాయణ అన్నారు.ఇందుకు కలిసి కట్టుగా మున్సిపల్ కౌన్సిలర్ లు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
-
రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో కళాబృందాల ఎంపిక.
-
బుధవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పై జిల్లా కలెక్టర్ లు,అదనపు కలెక్టర్ లతో నిర్వహించిన సమావేశం కు హాజరైన నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
-
ధాన్యం కొనుగోళ్ళు త్వరగా పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్* #248 కొనుగోలు కేంద్రాల ద్వారా 37647 మంది రైతుల నుండి 2,35,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు # 210 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు చెల్లింపు