తేదీ.28.11.2022
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు.
జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు తమ మొబైల్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని అలాగే ఆధార్ డేటాను నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ను నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని అలాగే బర్త్ రిజిస్ట్రేషన్ కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సంక్షేమ అభివృద్ధి పథకాల పౌర సేవలు పొందాలనుకునేవారు ఆధార్ నవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 2016 కంటే ముందుగా ఆధార్ గుర్తింపు కార్డు పొందినవారు యు ఐ. డి. ఏ ఆదేశాల ప్రకారం సంబంధిత పత్రాలతో మీసేవ కేంద్రాలలొ సంప్రదించాలన్నారు.
ఈ నవీకరణ ప్రక్రియ కు సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలని మీసేవ ఈ- డిస్టిక్ మేనేజర్ ఇక్బాల్ ని కలెక్టర్ ఆదేశించారు.వివిధ ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్ ,సిమ్ కార్డు తీసుకునేందుకు , రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మీ సేవకు ఇచ్చిన ఆధార్ సెంటర్ ను వారికి కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాలలో మాత్రమే ఆధార అనుసంధానం ప్రక్రియ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఓటరు గుర్తింపు కార్డు వివరాలను కూడా ఆధార్ కు అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు
.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, ఆర్డీవోలు కిషోర్ కుమార్, రాజేంద్ర కుమార్, వెంక రెడ్డి, డిడబ్ల్యూఒ జ్యోతి పద్మ, డీఎస్పీ నాగభూషణం, ఆధార్ రీజినల్ సెక్షన్ ఆఫీసర్ పి ఎన్ వి ఆర్ కృష్ణ, అకౌంట్ ఆఫీసర్ వినయ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
-‐-‐————-‐—————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యాపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.