ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు,

ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ ప్రతిపాదించిన
ఇసుక రీచ్ లను వాజేడు మండలం 3, వెంకటాపురం మండలం 7 ఇసుక రిచులను తెలంగాణ మైనింగ్ రూల్స్ ప్రకారం డి ఎల్ ఐ సి ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి త్వరితగతిన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఇసుక పర్మిషన్ వివరాలను అటవీ శాఖ వారిని పంపి వారి నుండి క్లియరేన్సు సూచనలు తీసుకోవాలని అయన అన్నారు.

ఈ సమావేశంలో డిఎఫ్ ఓ కిష్ట గౌడ్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రామాచారి, టి ఎస్ ఎం డి సి పిఒ ఎల్లయ్య, డిసిఓ సర్దార్ సింగ్, జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారి ఎం శ్రీనివాస రావు, కలెక్టరేట్ సూపర్ ఇండెంట్ విశ్వప్రసాద్, ఇర్రిగేషన్ ఎ ఈ ఈ శ్రీనివాస రావు, తహసిల్దార్లు శ్రీనివాస్, సంజీవ , లక్ష్మణ్ , వెంకటస్వామి, నాగరాజు, పేస కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post