రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 20:: రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం జిల్లా పరిషత్తు
చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 21వ తేదిన ఉదయం 11గంటలకు మహిళా సంక్షేమం ( స్థాయి సంఘం 5) మధ్యాహ్నం 2.30 గంటలకు వ్యవసాయం( స్థాయి సంఘం 3) సాయంత్రం 4 గంటలకు సాంఘిక సంక్షేమం( స్థాయి సంఘం 6 ) ఈనెల 22వ తేదిన ఉదయం 11 గంటలకు ప్రణాళిక, పనులు మరియు ఆర్థిక (స్థాయి సంఘం 1) పనులు (స్థాయి సంఘం 7) మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రామీణ అభివృద్ధి ( స్థాయి సంఘం 2) సాయంత్రం 4 గంటలకు విద్య మరియు వైద్య సేవలు (స్థాయి సంఘం 4 )
స్థాయి సంఘాల సమావేశాలకు సంబంధిత జిల్లా అధికారులు సకాలంలో పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన తెలిపారు.