_________________________
ఈనెల 24 న పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న పాలమూరు విశ్వవిద్యాలయం 3 వ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరాజన్ హాజరుకానున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్. బి లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు.
మూడవ స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆయన పాలమూరు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 24న మధ్యాహ్నం 3 వ స్నాతకోత్సవం నిర్వహించనున్నామని, ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయం ఛాన్స్ లర్ తమిళసై సౌందరాజన్ అధ్యక్షత వహిస్తారని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.జీ రావు స్నాతకోత్సవ ఉపన్యాసం చేయనున్నారని తెలిపారు .
ఈ సందర్భంగా పీహెచ్ డి చేసిన 6 గురికి పీహెచ్ డి పట్టాల ప్రధానంతో పాటు, 73 మంది విద్యార్థులకు బంగారు పథకాలను, 2932 మంది పీజీ , 30645 యూజి విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు.
విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం 2014 నవంబర్ 29న జరిగిందని, ఈ సందర్భంగా 60 బంగారు పథకాలు, 7636 మందికి యుజి, పీజీ డిగ్రీలు ప్రధానం చేయడం జరిగిందని ,రెండవ స్నాత కోసం 2019 మార్చి 6 న నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా 115 బంగారు పతకాలతో పాటు, 14675 పీజీ, యూజీ డిగ్రీలు ఇచ్చినట్లు తెలిపారు.
పాలమూరు విశ్వవిద్యాలయం 2008 లో ప్రారంభించగా అత్యున్నత విద్యా ప్రమాణాలతో ముందుకు తీసుకెళుతున్నామని, ముఖ్యంగా దశాబ్ద కాలంలో విశ్వవిద్యాలయం విద్యారంగంలో మౌలిక సదుపాయాలు ,అభివృద్ధి , సంస్థగత నిర్మాణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని ,పాలమూరు విశ్వవిద్యాలయం “న్యాక్ “గుర్తింపు మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి మళ్ళీ “న్యాక్” గుర్తింపునకు సిద్ధమవుతున్నట్లు వైస్ ఛాన్స లర్ వెల్లడించారు.
విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అభివృద్ధి పనులకు ప్రయత్నాలు చేస్తున్నామని, బోధనతోపాటు ,పరిశోధన, సౌకర్యాల కల్పన ,సంస్థలు ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇటీవలే కేంద్ర బృందం కూడా విశ్వవిద్యాలయంలో పర్యటించి వెళ్లిందని తెలిపారు.
ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో 1800 మంది విద్యార్థులు ఉన్నారని, 18 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయని ,వచ్చే విద్యా సంవత్సరం నుండి బాలికల హాస్టల్ కూడా ప్రారంభంకానున్నదని ఆయన వెల్లడించారు. అలాగే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్,లా కళాశాలల ప్రారంభానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరిగిందని, అంతేకాక ఫిజికల్ ఎడ్యుకేషన్ ను కూడా ప్రతిపాదించామన్నారు. వచ్చే సంవత్సరం నుండి యోగా డిప్లమా కోర్సును విశ్వవిద్యాలయంలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
24 న నిర్వహించనున్న 3 వ స్నాతకోత్సవ కార్యక్రమాన్నీ విజయవంతం చేసేందుకు 7 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందరి సహకారంతో ఈ స్నాతకోత్సవాన్ని జయప్రదం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
విశ్వవిద్యాలయం రిజిస్త్రార్
గిరిజా మంగతాయారు ,కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ , ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. కిషోర్, ఓ ఎస్ డి మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ రీసర్చ్ సెల్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్ , స్పెషల్ ఆఫీసర్ నాగభూషణం,జాయింట్ డైరెక్టర్ నూర్జహాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్. కుమారస్వామి, పిఆర్వో అర్జున్ కుమార్, ఏపీఆర్ఓ డాక్టర్ రఘు తదితరులు ఈ మీడియా సమావేశానికి హాజరయ్యారు.
_____________________