ప్రచురణార్థం
మహబూబాబాద్ జనవరి 24.
ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా 18 సంవత్సరంలు నిండిన కొత్త ఓటర్లకు ఏ పిక్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని 80 సంవత్సరములు దాటిన వృద్ధ ఓటర్లను సన్మానించడం జరుగుతుందన్నారు. అలాగే ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందన్నారు.