ఈవియం గోడౌన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్
00000
ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మంగళవారం పరిశీలించారు.
కలెక్టరేట్ వద్ద నున్న ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ భధ్రపరచు గోడౌన్ ను ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఈవిఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోడౌన్ ను క్షుణ్ణంగా తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈవిఎం గోడౌన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు, సిబ్బందికి పలు సూచనలను జారీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీస్తూ ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఎంట్రి రిజీష్టరులో సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, కలెక్టరేట్ ఏఓ జగత్ సింగ్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎన్. శ్రీనివాస్, యండి ఇర్ఫాన్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బిఎస్పి పార్టీ ప్రతినిధి మధు, టిడిపి పార్టీ ప్రతినిధి ఆగయ్య పాల్గోన్నారు.