పత్రికా ప్రకటన. తేది:19.10.2021, వనపర్తి.
ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో మెగా రుణ మేళ నిర్వహించనున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ వై.సురేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మెగా రుణమేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ రుణమేళాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన ముద్ర, స్వానిధి, స్టాండ్ అప్ ఇండియా, అగ్రి, పి.ఈ.ఎం.జి.పి, పి.ఎం.ఎఫ్.ఎం.ఈ, ఎమ్.ఎస్.ఎం.ఈ. రుణాలపై అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని ఆయన వివరించారు. పట్టణ ప్రజలు పాల్గొని, ఈ మెగా రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.