పత్రిక ప్రకటన
తేది: 27-1-2023
నాగర్బకర్నూల్ జిల్లా
సూచించారు. శుక్రవారం సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి జిలా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, మన ఊరు మన బడి పై వీడియో కన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు, బడిలీలు పూర్తి అయ్యేవిధంగా చూడాలన్నారు. జిల్లాలో స్పెషల్ మెడికల్ బోర్డు పెట్టుకొని 30వ తేదీ లోగా మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల పై ఇప్పటికే కసరత్తు పూర్తి చేయడం జరిగిందన్నారు. గజిటెడ్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ల సీనియారిటీ జాబితా తయారు చేసి ప్రకటించడం జరిగిందన్నారు. మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలనకై ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
మన ఊరు మనబడి విషయంలో మండలానికి రెండు చొప్పున 44 పాఠశాలలను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడం జరుగుతుందని వాటిలో 30 ఇప్పటికే పూర్తి అవగా పెయింటింగ్ మాత్రం 6 పాఠశాలలకు పూర్తి అయినట్లు తెలిపారు. ఉపాధి హామీ కి సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉపాధిహామీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని క్లియర్ చేయించాల్సినదిగా కోరారు. డ్యూయల్ డెస్క్ లు జిల్లాకు 246 వచ్చాయని తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకాటి కరుణ, టి.ఎస్.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి చైర్మన్ శ్రీధర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.
————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వార జారీ.