తేది.31.7.2021*
*పత్రిక ప్రకటన*
*ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. గౌరవ శాసన సభ్యుల అభ్యర్థన మేరకు ఆయా కళాశాలలను మంజూరు ఇచ్చారన్నారు. ఆయా ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రుల,ప్రజల కోరిక కూడా నెరవేరుతుందన్నారు.వికారాబాద్,పరిగి లలో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు.*
*ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్,పరిగి, మహేశ్వరం, ఉప్పల్ లకు నూతనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసి ఆయా ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.