పత్రికా ప్రకటన నల్గొండ,నవంబర్ 16. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడి (ఎమ్మెల్సీ) ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి,నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల నోటిస్ మంగళవారం జారీ చేశారు
స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి మంగళవారం నుంచి నల్గొండ లోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చాంబర్ లో నామపత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్,రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటన లో తెలిపారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా, ఉమ్మడి నల్గొండ మూడు జిల్లాల అదనపు కలెక్టర్ లు సహాయ రిటర్నింగ్ అధికారు లుగా వ్యవహరించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 16 నుంచి 23 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు.
ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.
ఈ నెల 24న నామినేషన్ ల పరిశీలన ఉంటుందన్నారు. 26 లోగా ఉపసంహరణకు గడువు నిర్ణయించగా, అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారనీ కలెక్టర్ తెలిపారు.