ప్రెస్ రిలీజ్
జనగాం జిల్లా, ఫిబ్రవరి 3
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈ.వీ.ఎం) గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
శుక్రవారం నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలను భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య జనగామ, స్టేషన్గన్పూర్ ఈఆర్ఓస్ సిహెచ్ .మధుమోహన్, కృష్ణవేణి, ఎన్నికల పర్యవేక్షకులు పి. శ్రీనివాస్ తో కలిసి తనిఖీ చేశారు,
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ సూచనల మేరకు నెలవారి సాధారణ తనిఖీల్లో భాగంగా ఈరోజు ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్ లో పోలీస్ భద్రత, సిసి కెమెరాలు, లైటింగ్, కావలసిన ఇతర రక్షణ సదుపాయాలు తదితర విషయాలను తనిఖీ చేసిన్నట్లు అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయని ఆయన తెలిపారు.