ఓటరు సవరణ జాబితా పకడ్బందీగా నిర్వహించాలి :: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్

ఓటరు సవరణ జాబితా పకడ్బందీగా నిర్వహించాలి :: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్

పత్రికాప్రకటన.1 తేదిః 01-12-2021
ఓటరు సవరణ జాబితా పకడ్బందీగా నిర్వహించాలి :: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్
జగిత్యాల, డిసెంబర్ 01:- జిల్లాలో ఓటరు సవరణ జాబితా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు ధృవీకరణ , ఓటరు జాబితా తయారీ , గరుడ యాప్, స్థానిక సంస్థల ఎన్నికలు వంటి పలు అంశాల పై ఆయన బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేసామని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జి ఐ ఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
నవంబర్ 1, 2021 న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేసి, నవంబర్ 30,2021 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించామని పేర్కొన్నారు. డిసెంబర్ 20,2021లోగా అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5,2022 న తుది ఓటరు జాబితా రుపోందించాలని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో ఉన్న విద్యాలయాలో ప్రత్యేక క్యాంపులు ఎర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యత పై కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని డిగ్రీ/వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్ లీటిరస్ క్లబ్బులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని , స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల మండల స్థాయిలో సమావెశాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ ను రుపొందించిందని, దీని పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్ వినియోగిస్తూ పరిష్కరించాలని, వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాలో ఉన్న ఈవిఎం గోడౌన్లను ప్రతి మాసం తనిఖీ చేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పోలింగ్ మరియు కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ జి.రవి, జగిత్యాల, జగిత్యాల ఆర్.డి.ఓ. శ్రీమతి మాధురి సంబంధిత అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయనైనది.

Share This Post