ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇంచార్జ్ అర్దిఒ నర్సింగ్ రావు కోరారు.
మంగళవారం ఉదయం నేడు జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేటు నుండీ ఏర్పాటు చేసిన ర్యాలీకి ఇంచార్జ్ అర్దిఒ నర్సింగ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సవత్సరాలు నిండిన ప్రతి యువత తన పేరును ఓటరూ జాబితాలో నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఓటు నమోదు చేసుకోవడమే కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించాలని అప్పుడే మంచి నాయకులు ఎన్నికై దేశ అభివృద్ధికి దోహదా పడినా వారావుతారని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన ఈ ర్యాలి నారాయణపేట ప్రబుత్వ పాఠశాల మైదానం లో ఏర్పాటు చేసిన సమావేశం వరకు నిర్వహించడమైనది. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమన్ని ప్రారంభించి ఈ సందర్బగంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువకులకు ఇంచార్జ్ అర్దిఒ చేతుల మీదుగా ఓటరు గుర్తింపు కార్డును అందించడం జరిగింది. జిల్లాలో కొత్త గా 1915 మంది ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. కొత్త ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఓటు చాల ప్రాముఖ్యమైనదని చాలామంది, స్వతంత్ర సమయం లో సమరయోదుల బలిదాన లు పొందిన తరువాత గణతంత్ర దినోత్సాహం కంటే ఒక్కరోజు ముందు 25 జనవరి తేదిన ఓటరు దినోత్సాహం జరుపోకోవడం జరుగుతోందని తెలిపారు. కొత్త ఓటర్లకు కార్డులను అందజేసి గత సవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినియర్ సిటిజన్స్ కు సన్మానం చేయడం జరిగింది. తరువాత కొత్త ఓటర్లకు,అక్కడ వచ్చిన విద్యార్థులు , ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ప్రతిజ్ఞ కంటే ముందు ఓటర్ దినోత్సాహం సందర్బంగా ఓటు ప్రముఖ్యత అనే అంశం పై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటి లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సమావేశం ప్రారంభం లో రాష్ట ఎన్నికల అధికారి సందేశాన్ని సియిఒ సిద్రమప్ప చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో డియిఓ శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ దనైయ్య, సర్వేయర్ మల్లేష్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.