కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో నిర్వహించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ప్రెస్ రిలీజ్

జనగామ జిల్లా

జనవరి 21

కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో నిర్వహించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

*జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలి

*బఫర్ వైద్య బృందాలతో వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు

*కంటి వెలుగు క్యాంపులో ట్యాబ్ ఎంట్రీలు సమర్థవంతంగా జరగాలి

*జిల్లాలో ఉన్న కళ్ళద్దాల స్టాక్ పై కలెక్టర్లు రెగ్యులర్ గా రివ్యూ తీసుకోవాలి

*కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

——————————

జనగామ జిల్లా, జనవరి – 21

జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ వీడియో సమావేశం హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్  తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనవరి 19, 20వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలను వైద్య శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 3,81,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 97,335 మందికి రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేశామని, 77,142 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేశామని అన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు.

ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని,  శని ఆదివారాలు క్యాంపులు ఉండవని  సీఎస్ తెలిపారు.  ప్రతి రోజూ ఉదయం 9-15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్ డేట్ చేయాలని సీఎస్ సూచించారు.

జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు క్యాంపులో పర్యటించాలని, జిల్లా కలెక్టర్ లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

రాష్ట్రంలో నిర్వహించిన 2 రోజులు క్యాంపులో 11 జిల్లాల పరిధిలో 53% పైగా కళ్ళద్దాల పంపిణీ/ఆర్డర్ అవసరం అయ్యాయని సీఎస్ తెలిపారు.

జిల్లాలో ఉన్న బఫర్ బృందాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులకు, ఉద్యోగులకు, పోలీసులకు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజులలో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు కావాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పక్కాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు కావాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ  పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు.  జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్న, చిన్న లోటుపాట్లను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

జిల్లాలో ఉన్న రీడింగ్ కళ్ళద్దాల స్టాక్ ను కలెక్టర్ లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని,  అవసరమైన కళ్ళద్దాల స్టాక్ వివరాలు పాయింట్ల వారిగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ సిహెచ్ .శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన కంటి వెలుగు ప్రోగ్రామ్స్ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు క్యాంపులు నిర్వహించాలని కంటి అద్దాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు ద్వారా వైద్య పరీక్షలు చేసుకునేలా గ్రామస్థాయి ఆశ, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

జిల్లాలో ఉన్న బఫర్ టీం ను ఉపయోగించి పాత్రికేయులకు ఉద్యోగులకు పోలీసులకు కోర్టు సిబ్బందికి వివిధ వర్గాల వారికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించుటకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ తెలిపారు,

ఈ వీడియో కాన్ఫరెన్స్ లు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.మహేందర్, రెవెన్యూ డివిజన్ అధికారులు మధుమోహన్, కృష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామ్ రెడ్డి, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ కే భాస్కర్, ఉప వైద్య అధికారులు అశోక్ కుమార్, సుధీర్, డాక్టర్ రాజశేఖర్, డి ఎల్ పి ఓ ప్రార్ధసారథి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post