ప్రజాణి సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలి
ప్రజావాణికి 231 ధరఖాస్తులు
అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ (లోకల్ బాడీస్), జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్
0000
ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ (లోకల్ బాడీల్), శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 231 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు వారు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఎస్సీ కార్పోరేషన్ కు చెందినవి 110, రెవెన్యూకు సంబంధించినవి 77, మున్సిపల్ కు చెందినవి 13, కాగా ఇతర శాఖలకు సంబంధించినవి 31 ఉన్నాయని అదనపు కలెక్టర్లు తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, కలెక్టరేట్ ఏ.ఓ లక్ష్మారెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస రావు, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, పశుసంవర్ధక శాఖ అధికారి నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత, రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఏ.డి, ల్యాండ్ జయశంకర్, డి.వై.ఎస్.ఓ, రాజవీర్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, మెప్మా పీ.డి రవిందర్, ఎల్.డి.యం,, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్, జిల్లా పరిశ్రమల శాఖ, అటవీశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, డిప్యూటీ తహశిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.