ప్రెస్ నోట్
కాజీపేట:11/05/2022
కార్మికుల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టినపథకాలపై అవగాహన కల్పించి ప్రతి కార్మికుడికి లబ్ధి చేకూరేలా చేయడమే కార్మిక చైతన్య మాసోత్సవం లక్ష్యం కార్మికుల అవగాహన సదస్సులో గౌరవ పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారితో కలిసి పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.
👉ప్రతి కార్మికుడు మాసోత్సవాలలో భాగస్వామ్యం కావాలి ..
👉37రంగాలకు చెందిన సంఘటిత అసంఘటిత కార్మికుల ఐక్యత ,అభివృద్ధికి మాసోత్సవాలు దోహదపడతాయి ..
👉 కార్మికుల ఐక్యత అభివృద్ధి సంక్షేమం కొరకు ఏర్పాటు కార్మిక చైతన్య మాసోత్సవాలు దోహదపడుతుంది.
👉కార్మికుల ఆరోగ్యానికై మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు.
👉నిన్న గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించారు.
👉550 మంది కార్మికులకు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు.
👉గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి.
👉టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు.
👉కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక బిల్లులను తీసుకువస్తున్నది.
👉కార్మికుల పని గంటలకు రోజు రోజుకు పెంచుతూ కార్మికుల హక్కులను కలరాస్తున్నారు.
👉వరంగల్ లో కార్మికుల హక్కులను సాధించడం కోసం అనేక ఉద్యమాలు చేశాం.
👉🏻బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కలరాస్తూ బిజెపి కుట్రలు చేస్తుంది.
👉🏻గతంలో ఉన్న 29 చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు తెచ్చి కార్మికులు కడుపుకొట్టింది.
👉🏻కార్మికులు హక్కులను తెలియజేసేందుకై వారి కోసం సభలు పెట్టి వారిని చైతన్యం చేస్తాం.
👉మే31న కార్మికులతో బహిరంగ సభ.