పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది: 09-09-2021
కాళోజి 108వ జయంతి తెలంగాణ భాష దినోత్సవ సందర్భంగా గురువారం ఉదయం కలెక్టరేట్ ప్రజావాణిహాల్ లో బిసి సంక్షేమ శాఖ అద్వర్యం అధికారికంగా నిర్వహించరు. ప్రజావాణి హాల్ లో ఏర్పాటు చేసిన కాళోజి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ డి హరిచందన పూలమాల వేసి వారు మాట్లాడుతూ కాళోజి 1914, సెప్టెంబరు 9 న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారాని కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ మరియు మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారని కొనిఅడరు. విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశ ప్రభుత్వ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరని, కాళోజి చాల పురస్కారాలు అందుకున్నారని, వారి సేవలను గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ ఓ వ్యక్తి కాదు సాహితీ శక్తిగా ప్రపంచంలో ప్రజాస్వామ్య ఆకాంక్షగా ప్రజల నోళ్ళల్లో నిలిచి గెలిచిన నిజమైన ప్రజాకవి అని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు
ఈ కార్యక్రమం లో బిసి సంక్షేమ అధికరి కృష్ణమ చారి, కలెక్టరేట్ ఏఓ ఖలీద్ మరియు జిల్లా అధికారులు, కలక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబందాల అధికారి ద్వార జరి