పత్రిక ప్రకటన
తేదీ : 07–05–2022
కీసర కలెక్టరేట్ను కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలుకలెక్టరేట్, ఆవరణను పరిశీలించిన న్యాయమూర్తులు, జిల్లా అధికారులు
షామీర్పేటలో నూతన కలెక్టరేట్ ప్రారంభించగానే…కీసరలో ప్రస్తుత కలెక్టరేట్ను కోర్టుగా మార్చేందుకు పరిశీలించిన న్యాయమూర్తులు, అధికారుల బృందం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో ప్రస్తుతం ఉన్న జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని జిల్లా కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంతో పాటు ఆవరణను శనివారం సాయంత్రం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సి.హెచ్.కె. భూపతి, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఆర్. తిరుపతి, 16వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీధర్లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం కీసరలో ఉండగా… అన్ని కార్యక్రమాలను అక్కడ నుంచే నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు షామీర్పేటలో నూతనంగా అన్ని హంగులతో జిల్లా కలెక్టరేట్కు సొంత భవనాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడకు కలెక్టరేట్ మారనున్న నేపథ్యంలో కీసరలో కొనసాగుతున్న జిల్లా కలెక్టరేట్ భవనాన్ని అద్దె చెల్లించి కోర్టుకు వినియోగించుకొనేందుకుగాను జడ్జిల బృందం పరిశీలించగా … ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో ఉన్న వివరాలను జడ్జిలకు జిల్లా అధికారులు వివరించారు. షామీర్పేటలో నూతనంగా అన్ని జిల్లాల్లో మాదిరిగా నిర్మించినట్లుగానే మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణం అన్ని పనులు పూర్తయినందున అందులోకి త్వరలో మారే అవకాశం ఉంది. నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చి ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్నందున ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ సముదాయాన్ని అద్దె చెల్లించి కోర్టుగా మార్చేందుకు ఈ భవనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.