కేజీబీవీ పాఠశాల, గిరిజన బాలికల గురుకుల కళాశాల వసతి గృహాన్ని, నూతన కలెక్టరేట్ సముదాయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
28 8 2021
వనపర్తి

సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభానికి పాఠశాలల ఆవరణ తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.

శనివారం పదవ వార్డులోని కేజీబీవీ పాఠశాలను, గిరిజన బాలికల గురుకుల కళాశాల హాస్టల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలు తరగతి గదులు వంటగది మరుగుదొడ్లు పై ఆరా తీశారు. సెప్టెంబర్ 1న విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య చర్యలు వంట గదులు మరుగుదొడ్లు పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే విద్యాసంస్థల ప్రతినిధులతో హెడ్మాస్టర్ లతో మాట్లాడి తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బంది పాఠశాలల వాతావరణ పరిశుభ్రం చేసే పట్టణాలలో మున్సిపాలిటీ సిబ్బంది పాఠశాల ఆవరణ పరిశుభ్రత చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించి పాఠశాలకు రావాలని అన్నారు. పాఠశాలలో కళాశాలలో శానిటైజర్ వాడాలి భౌతిక దూరం పాటించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో మిగిలిన పనులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. అందమైన మొక్కలు నాటాలని అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే కలెక్టర్ కార్యాలయం అన్ని హంగులతో ముస్తాబు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ నవిత, గోవర్ధన్ తోపాటు పాఠశాలల హెడ్మాస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి యాదమ్మ, ఈఈ దేశ్యనాయక్ డి.ఈ.దానయ్య హార్టికల్చర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

……………

జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post