కోతుల బెడద నివారణపై అరణ్య భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖా మంత్రి
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు*
కోతుల బెడదను నివారించాలి
కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు .. ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం
రాష్ట్రంలో 5 నుండి 6 లక్షల కోతులు
కోతుల నియంత్రణకు కుటుంబ నియంత్రణ చికిత్స
ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాల పరిశీలన
పంటలకు కోతుల బెడద తీవ్రంగా ఉంది
రైతులను ఈ ఇబ్బంది నుండి గట్టెక్కించాలి
చేతికొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారు
కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి
పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉంది
అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను ప్రతి సీజన్ కు అందుబాటులో ఉండేలా పెంచాలి
పల్లె ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలి
ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలలో వేసిన పండ్ల మొక్కలు అప్పుడే ఫలితాలనిస్తున్నాయి
రైతులకు కోతుల బెడదను తప్పించాలన్న విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది
కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 8 మంది అధికారుల కమిటీతో మంత్రుల భేటీ
కోతుల బెడద నివారణపై అరణ్య భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖా మంత్రి
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు, కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్ రఘునందన్ రావు గారు, పీసీసీఎఫ్ (సోషల్ ఫారేస్ట్రీ) ఆర్.యం. దొబ్రియల్, సీఎఫ్ హైదరాబాద్ ఎం,జే అక్బర్,
అటవీశాఖ ఉన్నతాధికారులు, తదితరులు.