ప్రచురణార్ధం
జనవరి, 25 ఖమ్మం:
కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కరోనా ఉధృతిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా. శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని 56వ డివిజన్ నందు ఫీవర్ సర్వేలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి మంత్రి పాల్గొని స్వయంగా స్థానికులకు జ్వరం పరీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు వ్యాక్సినేషన్లో జిల్లా 100 శాతంతో పూర్తి చేసుకొని ముందంజలో నిలిచిందని మంత్రి తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకముందే ప్రజలు స్వీయరక్షణతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోనా, ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు : తీసుకుంటుందని అన్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, ఏరియా ఆసుపత్రులు, పి.హెచ్.సి.లలో కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు, ఐసోలేషన్ కిట్లకు కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏరియా ఆసుపత్రిలో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించి వైరసన్ను నిరోధించాలని సిబ్బందికి సూచించారు.
కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు తాతా మధుసూధన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, వైరా శాసన సభ్యులు రాములు నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రంజిత్ కుమార్, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పుష్ప, అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.