ప్రెస్ రిలీజ్. తేది. 21.08.2021
గాంధారి మండలం రాంపూర్ గడ్డ, పోతంగల్ కాలాన్, మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను శనివారం నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. ఖాళీ స్థలాలలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. రక్షణ గార్డులు సక్రమంగా మార్చాలని కోరారు. మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోతే పంచాయతీ కార్యదర్శుల పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో వరుసలలో పెద్ద మొక్కలు నాటాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎంపీడీవో సతీష్ కుమార్, ఎంపీవో రాజ్ కిరణ్, అధికారులు పాల్గొన్నారు.
Dpro..Kama reddy