గురువారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షర్మాన్ నవంబర్ 13 న నిర్వహించే మెగా క్యాంపు నిర్వహణ పై జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పాన్ ఇండియా అవెర్నెస్ మరియు అవుట్ రిచ్ కార్యక్రమం అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా నవంబర్ 13 న ఒక మెగా క్యాంపును జిల్లా యంత్రాంగం మరియు లీగల్ సర్వీసెస్ అథారిటీ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ క్యాంపు నిర్వహణలో జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఈ స్టాల్స్లో వారు పేదలకు, మహిళలకు, పిల్లలకు, అంగవైకల్యం ఉన్న వారికీ, కార్మికులకు చేసే కార్యక్రమాలు తెలిపే విదంగా బోర్డులు ప్రదర్శించాలని, వారు అందించే పధకాల పై అవగాహనా కల్పించడానికి గైడ్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

            ఈ కార్యక్రమంలో జిల్లాలోని  లబ్దిదారులను గుర్తించి వారికీ ఆ రోజున అందజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు మరియు ఇతర సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

????????????????????????????????????

Share This Post