వికారాబాద్ జిల్లా :- పూడూర్ మండలం, మీర్జాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల రాత్రి పూట ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ కార్యదర్శి స్థానికంగా లేకపోవాడం కారణంగా ఆగ్రహం వ్యక్తపరిచారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టి దోమలు ప్రబలకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలో హైపోక్లోరైడ్ స్ప్రే చేయించాలని, LED బల్బులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై నీరు నిలువ్వకుండ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఎంపీవో కరీం ను ఆదేశించారు. NREGS కూలీలతో గ్రామంలో పిచ్చి మొక్కలుతొలగించాలన్నారు. గ్రామంలో మొక్కలు నాటాలన్నారు. అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను DE లు, AE లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైన్ ల కోసం ఎస్టిమేషన్లు తయారు చేయాలని పంచాయతీ రాజ్ EE ని ఆదేశించారు. దళిత వాడ సర్వేను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎంపీడీఓ ఉషా, తహసీల్దార్ కిరణ్, డివిజన్ పంచాయతీ అధికారిని అనిత తదితరులు పాల్గొన్నారు.