నల్గొండ, అక్టోబర్ 13. గ్రామపంచాయితీ నర్సరీలలో మొక్కల సేగ్రిగేట్, మట్టి సేకరణ, భూమి చదును చేయటం, పాలీథీన్ సంచుల కొనుగోలు, ప్రైమరీ బెడ్లు చేయుట అక్టోబర్ 18 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి సహాయక పథక సంచాలకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయత్ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి నర్సరీల పురోగతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాల పురోగతి, యం.జి.యన్.ఆర్.ఇ.జి.యస్. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయితీలలో నర్సరీలకు అంచనాలు అక్టోబర్ 14 వ తేదీ లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లను ఆదేశించారు. అన్ని గ్రామపంచాయితీ నర్సరీలకు గేటు,ఫెన్సింగ్ మరియు ఇతరత్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్టోబర్ 20 లోగా పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. గ్రామపంచాయితీలలో నర్సరీలకు సీడ్ కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలకు సంబంధించిన అన్ని చెల్లింపులు అక్టోబర్ 20 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారుబృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలకు అవసరమైన వనసేవక్ లను నియమించి వారి పేర్లు, ఫోన్ నెంబర్ లను బోర్డులపై వ్రాయించి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామపంచాయితీలో 30 మందికి తక్కువ కాకుండా కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు.
మండలాలలో పెండింగులో ఉన్న సి.సి.చార్జీలు 50% తగ్గకుండా చెల్లింపులు అక్టోబర్ 14 లోగా చేయాలని తెలిపారు. సస్పెండేడ్ మరియు రిజేక్టేడ్ పేమెంట్స్ వెంట వెంటనే పూర్తి చేయుటకు తగిన చర్యలు గైకోనాలని అన్నారు.ఈ వి.సి.లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డి.ఆర్.డి.ఓ కాళిందిని,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి,డి.పి.ఓ.విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


