ప్రచురణార్థం
చోక్ల తండా నుండి గురిమెల్ల వరకు బిటి రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్.
బయ్యారం,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -07:
చోక్ల తండా నుండి గురిమెల్ల వరకు బిటి రోడ్డు రెన్యువల్ పనులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి శంకుస్థాపన చేశారు.
మంగళవారం బయ్యారం మండలంలో మంత్రులు పర్యటించి చోక్ల తండా గ్రామంలో చోక్ల తండా నుండి గురిమెల్ల వరకు పంచాయతి రాజ్ నిధులు 1.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు రెన్యువల్ కు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్, ఎమ్మేల్యే శంకర్ నాయక్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో కొమురయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.