ప్రచురణార్ధం
సెప్టెంబరు 30 ఖమ్మం:–
జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకై పటిష్ట చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ, భూ సర్వే అధికారులను ఆదేశించారు. గురువారం రఘునాథపాలెం తహశీల్దారు కం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ : కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ప్రభుత్వ భూముల రికార్డులను తనిఖీ చేసారు. అనంతరం క్షేత్రస్థాయిలో మండల పరిధిలో గల 21,22,30, 218 సర్వే నెంబర్లలోని అదేవిధంగా చింతగుర్తిలోని 266 సర్వేనెంబర్లను ప్రభుత్వ భూములను కలెక్టర్ పరిశీలించారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం గుర్తించిన 14 ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి సత్వరమే మొక్కలు నాటే ప్రక్రియను మొదలు పెట్టాలని, ప్రజలకు ఆహ్లాదకరంగా, చిన్నారులకు ఆటవిడుపుగా ఉండే విధంగా బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా ఏర్పాటు చేయాలని ఎం.పి.డిను. కలెక్టర్ ఆదేశించారు. రఘునాథపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి ఆటస్థలానికి గాను మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని అదేవిధంగా ఐ.టి.డి.ఏ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పాఠశాలకు ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రఘునాథపాలెం రైతువేధిక భూసార పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతువేదిక ద్వారా రైతులకు వ్యవసాయానుబంధ రంగాలలో వివిధ పంటసాగు ఆధునిక పద్ధతులు తెలియజేయడంతో పాటు భూసార పరీక్షల ద్వారా అనుకూల వంటసాగును తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
శిక్షణ కలెక్టర్ బి రాహుల్, ఆర్.డి.ఓ. రవీంద్రనాథ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. వి. రాము, తహశీల్దారు. నర్సింహారావు, ఎం.పి.డి.ఓ. రామకృష్ణ, ఎం.పి.ఓ శాస్త్రీ, తదితరులు పాల్గొన్నారు.