జిల్లాల లో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                        తేది: 21-01-20 23

జిల్లాల లో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో  నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నుండి  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,  అదనపు కలెక్టర్ (ఎల్ బి) అపుర్వ్ చౌహాన్  తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనవరి 19, 20వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలను వైద్య శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 3,81,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 97,335 మందికి రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేశామని, 77,142 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేశామని అన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు.

ప్రతి వారం సోమవారం నుండి  శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని,  శని ఆదివారాలు క్యాంపులు ఉండవని  సీఎస్ తెలిపారు.  ప్రతి రోజూ ఉదయం 9-15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్ డేట్ చేయాలని సీఎస్ సూచించారు.

జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు క్యాంపులో పర్యటించాలని, జిల్లా కలెక్టర్ లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

రాష్ట్రంలో నిర్వహించిన 2 రోజులు క్యాంపులో 11 జిల్లాల పరిధిలో 53% పైగా కళ్ళద్దాల పంపిణీ/ఆర్డర్ అవసరం అయ్యాయని సీఎస్ తెలిపారు.

జిల్లాలో ఉన్న బఫర్ బృందాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులకు, ఉద్యోగులకు, పోలీసులకు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజులలో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు కావాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పక్కాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు కావాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ  పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు.  జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్న, చిన్న లోటుపాట్లను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

 

జిల్లాలో ఉన్న రీడింగ్ కళ్ళద్దాల స్టాక్ ను కలెక్టర్ లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని,  అవసరమైన కళ్ళద్దాల స్టాక్ వివరాలు పాయింట్ల వారిగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో 2 రోజుల్లో 6,158  మందికి కంటి పరీక్షలు నిర్వహించగా  1449  మందికి రీడింగ్ కళ్ళద్దాలు అందించామని అన్నారు.   జిల్లాలో ఉన్న 1  బఫర్ బృందాలను వినియోగిస్తూ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీస్, కోర్టు సిబ్బందికి ప్రత్యేకంగా క్యాంపులు నియోజకవర్గం వారిగా నిర్వహించుటకు షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 

జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నుంచి ఉద్యోగులు   మరియు పత్రికా విలేకరులకు  3 రోజుల పాటు క్యాంపు ఏర్పాటు చేయాలని, ప్రతి రోజూ ఏ శాఖ సిబ్బంది క్యాంపు రావాలో షెడ్యూల్ తయారు చేసి సంబంధిత జిల్లా అధికారులకు అందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ, సిద్దప్ప, స్రవంతి, డాక్టర్ ఇర్షాద్  , డివిజన్  పంచాయతీ అధికారి వెంకట్ రెడ్డి, ,జాడ్ పి సి ఇ ఓ విజయనయాక్  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంజోగులాంబ గద్వాల్  జారీ చేయబడినది.

Share This Post