నిజామాబాద్, ఆగస్టు 4:–
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో ఆకస్మికంగా పర్యటించారు.
బుధవారం ఆయన స్థానిక ఖలీల్ వాడి లో గల ఏ.డి., సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఆఫీస్ ను ఆకస్మికంగా సందర్శించి కంప్యూటర్ లో అప్డేషన్ అయిన వివరాలు, ఆఫీస్ రికార్డులు పరిశీలించారు. సేత్వార్., సప్లమెంటరీ సేత్వార్. వసూల్ బాకీ.విలేజ్ మ్యాప్., తదితర రిజిస్టర్లు, ఇతర రికార్డ్స్ పరిశీలించారు. భూ భారతి గురించి (LR) ల్యాండ్ రికార్డ్స్ రిజిస్టర్ గురించి ఏ.డి. ని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఎడి ల్యాండ్ సర్వే కిషన్ రావు, సర్వేయర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.