పత్రిక ప్రకటన–1 తేదీ : 01–09–2022
============================================
జిల్లా వ్యాప్తంగా ఆధార్కు ఓటరు జాబితాను వేగవంతం చేసి పూర్తి చేయాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
ప్రభుత్వ సూచనల ప్రకారం ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఓటర్ జాబితా – ఆధార్ అనుసంధానంపై జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎలక్ట్రోరియల్ రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వో), మండలాల తహశీల్దార్లు, బూత్ లెవల్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓటరు జాబితాకు ఆధార్ను అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ తిరిగి అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని… త్వరగా పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు తెలుసుకొంటూ ఉండాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వివరించారు. అలాగే 6–బీ ఫారాలలో దరఖాస్తుదారులు ఆధార్ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.