* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 27 (శుక్రవారం).
జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉద్యానవనం, విద్య, వైద్యఆరోగ్యo, విద్యుత్తు, మిషన్ భగీరథ త్రాగునీరు తదితర శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని సంబంధిత శాఖల జిల్లా అధికారులు సమావేశంలో వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతూ వారి వారి మండలాల్లో ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆయిల్ పామ్ సాగుచేస్తున్న ప్రాంతానికి రైతులను తీసుకెళ్లి చూపించాలని, వర్షాలతో నష్టపోయిన పంటలను త్వరగా లెక్కించి నష్టపరిహారం అందేలా చూడాలని, కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపుకు గురవుతున్న మహదేవపూర్, కాటారం,పలిమేల మండలంలోని భూములను పరిశీలించి నష్టపరిహారం అందించాలని, కాటారం మండలం పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నందున రైతులకు మేలు రకం పండ్ల తోటలను పెంచేందుకు శిక్షణ ఇప్పించాలని, తాడిచర్లలో గల ఏఎంఆర్ బొగ్గు బ్లాక్ వలన పరిసర ప్రాంతాల ప్రజలు కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారని వారికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు తాడిచెర్ల పీహెచ్సీలో ఏఎంఆర్ కంపెనీ ద్వారా వైద్యులు నియమించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని, మానేరు నదికి సంబంధించిన పూర్తి బెనిఫిట్స్ పెద్దపల్లి జిల్లాకు పోతున్నాయని ఈ రెండు జిల్లాల అధికారులతో సర్వే చేయించి జిల్లా వాటాను జిల్లాకు వచ్చేలా చూడాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను అందుబాటులో ఉంచి 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, గ్రామాలలో గుడుంబా వలన పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని గుడుంబాను నియంత్రించాలని, అన్ని మండలాలలో సదరo క్యాంపులు నిర్వహించి అర్హత ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని, ఇప్పటికే సదరం క్యాంప్ లకు హాజరై వివిధ కారణాలతో సర్టిఫికెట్ పొందని అర్హత ఉన్న దివ్యాంగులకు కూడా పింఛన్ వచ్చేలా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, కాటారం పరిసరాల ఐదు మండలాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయం మంథనిలో ఉండడం మూలంగా 15 మండలాల్లో మిషన్ భగీరథ సరఫరాకు అధికారుల పర్యవేక్షణ కొరవడుతుంది కాబట్టి ఆ అయిదు మండలాలను భూపాలపల్లి డివిజన్ లో కలపాలని, వెలిశాల పి.హెచ్.సి పరిసరాల్లో ఉన్న కొన్ని గ్రామాలు దూరంగా ఉన్న ఒడితేల పరిధిలో ఉన్నాయని దాంతో ఆయా గ్రామాల ప్రజలు వైద్య సేవలు పొందడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆయా గ్రామాలను పి.హెచ్.సి వెలిశాల పరిధిలోకి తీసుకురావాలని, పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నందున తల్లిదండ్రులకు పూర్తి భరోసా కలిగించేలా అన్ని పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రైవేటు విద్య సంస్థలలో పాత ఫీజులను వసూలు చేయకుండా చూడాలని, సంవత్సరం మొత్తానికి కాకుండా ప్రతి నెల పాఠశాల ఫీజులను వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యంగా రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఉద్యాన పంటలు ఫిషరీస్, పాడిపరిశ్రమలో ప్రోత్సాహం, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని, కరోనా నిబంధనలను పాటిస్తూ సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలను పున ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నదని ఆయా కార్యక్రమాలను సంబంధిత అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు అధికంగా ఫీజులు వసూలు చేయకుండా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని, అదేవిధంగా జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు త్వరగా విద్యుత్ కనెక్షన్స్ అందించాలని, వర్షాలతో పడిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని, వైద్యఆరోగ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంది పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ 100% పూర్తిచేయాలని అన్నారు. అధికారులు బాధ్యతగా భావించి ఆయా శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ముందస్తుగా అందజేసి జనరల్ బాడీ మీటింగ్ కు హాజరు కావాలని ఈ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయాలన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ మంథని సెగ్మెంట్లో ఉన్న జిల్లాలోని మల్హర్రావు, కాటారం, మహాదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాలను అధికారుల పర్యవేక్షణ కొరకు భూపాలపల్లి సెగ్మెంట్లో విలీనం చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని సమావేశం నిర్ణయం మేరకు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో లేనందున రెండు మండలాలకు ఒక విద్యాశాఖ అధికారిని నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం అవుతున్నoదున ఉపాధ్యాయులు లేకుండా ఏ పాఠశాల ఉండరాదని అవసరమైతే ప్రక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్ మీద పంపించాలని, వారం పది రోజుల్లోగా మరొకసారి సదరo క్యాంపు నిర్వహించాలని, జనాభా పెరిగిన దానికి అనుగుణంగా మిషన్ భగీరథ త్రాగునీరును పెరిగిన జనాభాకు అందేలా చర్యలు చేపట్టాలని, ఆస్పిరేషనల్ డిస్టిక్ కార్యక్రమం ద్వారా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ కు ప్రత్యేక భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, రుణమాఫీ వివరాలను రైతులకు అందించాలని, మందుల దుకాణాలలో ఎరువులు, రసాయనాల స్టాక్ వివరాలను ప్రదర్శించాలని, ఆయిల్ ఫామ్ పండించేందుకు ముందుకు వచ్చిన రైతులతో ఆయిల్ ఫామ్ పండించే జిల్లాలలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రైతుబీమా పథకంపై రైతులకు పూర్తి స్థాయిలో మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అవగాహన కల్పించాలని, మానేరు నదికి సంబంధించి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో సంయుక్తంగా సర్వే చేసి రెండు జిల్లాలు లబ్ధి పొందేలా చర్యలు చేపట్టాలని, ఉద్యానవన మల్చింగ్ యూనిట్లను అధికంగా ఇవ్వాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ బాగానే జరుగుతుందని అదేవిధంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని, హెల్త్ సబ్ సెంటర్స్ నిర్మించడానికి మండలాలలో భూములను గుర్తించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామ పంచాయతీలు చురుగ్గా పాల్గొనాలని, వర్షాకాలం ప్రారంభమైనoదున ఇంటింటికి శుద్ధమైన మిషన్ భగీరథ తాగునీటి తప్పకుండా అందించాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు త్వరగా కనెక్షన్లు అందించాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలలకు విద్యార్థులు అధిక మొత్తంలో హాజరయ్యేలా అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని, ప్రైవేట్ విద్యా సంస్థలలో పాత ఫీజులను వసూలు చేయకుండా నియంత్రించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి,ఎంపీపీలు, జడ్పిటీసీలు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల జిల్లా స్థాయి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.