జూన్ 10న జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేశ్
. 0 0 0 0 0

జిల్లాలోని అన్ని కోర్టులలో జూన్ 10న జాతీయ లోక్ అదాలత్ లను నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేశ్ తెలిపారు.
జాతీయ న్యాయసేవాధికార సంస్థ డిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ హైదరాబాద్ గారి ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టులలో 10-06-2023 ఉదయం 10 గంటలకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరి కె. వెంకటేశ్ తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్కుబౌన్స్ కేసులు, మోటార్ వాహనాల చట్టానికి సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు మరియు చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడునని, కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.