పత్రికా ప్రకటన తేది:29.11.2022, వనపర్తి.
టీ.ఎస్. – ఐ పాస్ ద్వారా సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకొని యువత ఆర్థికాభివృద్ధి పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ సూచించారు.
మంగళవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ – ఐ పాస్ సబ్సిడీ రుణాలపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్.సి. ఎస్.పి. లకు (4) యూనిట్లు, టి.ఎస్.పి. లకు (6) యూనిట్ల చొప్పున సబ్సిడీ రుణాలను కమిటీ ఆమోదించినట్లు ఆయన వివరించారు. ఎస్.సి, ఎస్. టి. వర్గాల యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ యాదగిరి, ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి విజయ సారధి, టీఎస్ పిసిబి సాయివిద్య మనీ నాయక్, టీఎస్ ఎస్ పిడి సి ఎల్. వేణు, డి సి టి వో నాగేందర్. సీనియర్ అసిస్టెంట్ రామ్ శేఖర్, డి ఐ సి సి ఐ సోమశేఖర్, డి టి డి ఓ. ఏవో దిలీప్ కుమార్, పవన్, ప్రతాప్, రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.
…..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.