టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు కి గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు.రెండు ఒలింపిక్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ గా చరిత్ర సృష్టించిన సింధు భారత్ కె గర్వకారణం అని గవర్నర్ అన్నారు.సింధు విజయాలు స్ఫూర్తిదాయకం అని డాక్టర్ తమిళి సై అన్నారు.