You Are Here:Home→డిసెంబర్ చివరి వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి:: రాష్ట్ర వైద్య ఆరోగ్య , ఆర్థిక శాఖల మంత్రి టి. హరిష్ రావు* *గ్రామ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రణాళిక సిద్ధం చేయాలి* *సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలి* *అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై జిల్లాలో బులిటెన్ విడుదల* *ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి* *జిల్లాలో గ్రామాలు,ప్ మండలాలు పోటితత్వంతో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి* *కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్, తదితర అంశాలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ(కోవిడ్ 19)*
డిసెంబర్ చివరి వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి:: రాష్ట్ర వైద్య ఆరోగ్య , ఆర్థిక శాఖల మంత్రి టి. హరిష్ రావు* *గ్రామ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రణాళిక సిద్ధం చేయాలి* *సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలి* *అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై జిల్లాలో బులిటెన్ విడుదల* *ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి* *జిల్లాలో గ్రామాలు,ప్ మండలాలు పోటితత్వంతో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి* *కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్, తదితర అంశాలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ(కోవిడ్ 19)*
నల్గొండ, డిసెంబర్ 1: డిసెంబర్ చివరి వరకు రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టి. హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్, తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు హరీష్ రావు, కె. తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 2.77 కోట్ల జనాభా లక్ష్యానికి 2.49 కోట్ల (90 శాతం) మొదటి డోస్, 1.28 కోట్ల (46 శాతం) రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల 48 వేల 369 మంది సెకండ్ డోస్ కాలపరిమితి పూర్తయిన వారు వున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి జరుగుతుందని , రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ప్రపంచంలో నూతన కరోనా వేరియంట్ వ్యాప్తి నివారణకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం చాలా ముఖ్యమని, డిసెంబర్ చివరి వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ లను మంత్రి ఆదేశించారు. పంచాయతీ, మున్సిపాలిటీల సహకారంతో మొదటి డోస్ వ్యాక్సినేషన్ జాతీయ సగటు (83 శాతం) కంటే అధికంగా రాష్ట్రంలో 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. రెండవ డోస్ వ్యాక్సినేషన్ అంశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలోని గ్రామాలు, మండలాల మధ్య పోటీతత్వం పెంచాలని, 100 శాతం వ్యాక్సినేషన్ తన గ్రామాల్లో మండలాలను ప్రకటించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి, 5 ప్రోగ్రాం అధికారులు, డిసిహెచ్ఎస్ తక్కువ వ్యాక్సినేషన్ అవుతున్న మండలాలు, పీహెచ్ సిలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఐటి,పురపాలన, పరిశ్రమల శాఖల మంత్రి కె. తారకరామారావు మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. కరోనా మొదటి, రెండవ దశల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పుకార్లు ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని, అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండాలని, ఒమిక్రాన్ గురించి వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని తెలిపారు. కరోనా చికిత్స కోసం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన అంశాలతో ప్రతి జిల్లాలో బులిటెన్ విడుదల చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. కరోనా ఎదుర్కోవడానికి 24×7 పనిచేసే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ అంశంలో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య పోటీతత్వం పెంపొందించాలని, జిల్లా వారీగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకొనని ప్రజల వివరాలు సేకరించి సంబంధిత ప్రజాప్రతినిధులకు అందించాలని, వారితో సమన్వయం చేసుకుంటూ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా పనిచేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థల్లో 95 శాతం టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 2 రోజులు ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాలు నిర్వహించి టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బంది, 18 సంవత్సరాలు పైబడిన విద్యార్థులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు అన్ని పాటించాలని మంత్రి పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వ్యాక్సినేషన్ పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం వివిధ జిల్లాలో సబ్ సెంటర్ల నిర్మాణం, రేడియాలజీ ల్యాబ్ లు, ఏరియా ఆసుపత్రుల విస్తరణ, ఆర్టిఫీసీఆర్ ల్యాబ్ లు మంజూరు చేసిందని వాటికి సంబంధించిన స్థలాలను వైద్యశాఖకు త్వరగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ సీఈవో వీర బ్రహ్మ చారి, జిల్లా వైద్యాధికారి డా. కొండల్ రావు, డీఈఓ భిక్ష పతి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
డిసెంబర్ చివరి వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి:: రాష్ట్ర వైద్య ఆరోగ్య , ఆర్థిక శాఖల మంత్రి టి. హరిష్ రావు* *గ్రామ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రణాళిక సిద్ధం చేయాలి* *సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలి* *అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై జిల్లాలో బులిటెన్ విడుదల* *ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి* *జిల్లాలో గ్రామాలు,ప్ మండలాలు పోటితత్వంతో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి* *కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్, తదితర అంశాలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ(కోవిడ్ 19)*