డిసెంబర్ 10 న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా, నిస్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించుటకు అన్నీ చర్యలు తీసుకోవాలసినదిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు.

బుధవారం నాడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10 న పోలింగ్ ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో  కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం  జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ వర్కర్లను నియమించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫొన్లను అనుమతించకూడదని అన్నారు.  అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని సూచించారు.  ఎన్నికల నిర్వహణకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని  అన్నారు.. పోలింగ్ సామాగ్రి తో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు, తిరిగి పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్ లతో రిసెప్షన్ సెంటర్ కు  వచ్చేటప్పుడు బందోబస్తుతో రావాలని అన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల లో ఏదేని ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ అధికారులు ఇచ్చే వయోలెట్ పెన్నుతోనే బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు చెప్పాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఏఎన్ఎం లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈనెల 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి,  జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి,  డి సి పి నారాయణ రెడ్డి, ఆర్డీవో భూపాల్ రెడ్డి,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Share This Post