రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి అందరూ జిల్లా కలెక్టర్లతో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమం పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వైద్య,ఆరోగ్య,పురపాలక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు.వరంగల్ కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలో ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేసెందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉందని, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలోని వార్డుల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం పై సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. గ్రామీణ ప్రాంతాలో సైతం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టాలని, దీని కోసం ప్రతి ప్రాథమిక ఆరొగ్య కేంద్రం పరిధిలో ఉన్న సబ్ సెంటర్, వాటి పరిధిలో ఉన్న గ్రామాలో వ్యాక్సిన్ చేయుటకు ప్రణాళికలు రుపొందించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో అవసరమైన మేర వ్యాక్సిన్ అందుబాటులొ ఉన్నందున పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. గ్రామాలో ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ అందించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే చేసి ఇండ్లలలో వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు డోర్లకు స్టికర్ లను అంటించాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ స్థాయి అధికారులు చురుగ్గా పాల్గొనాలని అన్నారు. కోవిడ్ నివారణ టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మొదటి కోటి డోసుల వ్యాక్సినేషన్ కు 178 రోజుల సమయం పట్టిందని, రెండవ కోటి వ్యాక్సిన్ డోసులు 71 రోజులలో పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో మూడో కోటి వ్యాక్సినేషన్ డోసులను 20 రోజులోపు అందించి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతుందని సీఎస్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లాలో మిగిలిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు సూక్ష్మ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గురువారం నుండి గ్రామాల వారీగా సబ్ సెంటర్ యూనిట్ గా, వార్డుల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయుటకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, వార్డు మెంబర్ల,మున్సిపల్ కౌన్సిలర్ ల సహకారం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.జిల్లా స్థాయిలో వ్యాక్సినేషన్ లో ఎదురయ్యే సమస్యలు పరిష్కారంకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.వ్యాక్సినేషన్ త్వరగా వంద శాతం పూర్తి చేసిన ఉత్తమ గ్రామ పంచాయతీల కు ప్రశంసా పత్రం అంద చేస్తామని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి వీర బ్రహ్మ చారి, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డా.కొండల్ రావు, జిల్లా పంచాయితీ అధికారి విష్ణు వర్ధన్, తదితరులు పాల్గోన్నారు.
———-/////—————
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం నల్గొండ గారిచే జారీ చేయడమైనది.

