తేదీ.2-05.2022 సూర్యాపేట. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందాలి. ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య పెంచాలి. అన్ని ఆసుపత్రులను పరిశుభ్రఅంగా ఉంచాలి. రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు. వైద్యారోగ్యంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ.

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పులు ఎక్కువగా జరగాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అరోగ్య రంగానికి బ‌డ్జెట్‌లో రూ. 11,440 కోట్లు కేటాయించారు. ప్ర‌జ‌ల‌కు అత్యున్న‌త వైద్య సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌దని అన్నారు.
దేశంలో అరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానం చేరేందుకు అందరం కలిసి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య సేవలు విస్తృతం అయ్యాయి. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. మరింత మెరుగ్గా ఈ సేవలు ప్రజలకు అందించేందుకు మానిటరింగ్ పెంచాలి. 99 శాతం బాగా పని చేసినా ఒక్క నిర్లక్ష్యం చెడ్డ పేరు తెస్తుంది. అలా జరగకుండా చూడాలని అన్నారు.
ముఖ్యమంత్రి గారి ఆలోచనతో దేశంలోనే టి డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతమైన రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నాము. 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. దీనిపై దృష్టి పెట్టాలని అన్నారు.
అరోగ్య శ్రీ సేవలు ప్రజలకు మరింత అందేలా చూడాలని, ఎక్కువ కేసులు చేయడం వల్ల పేదలకు ఉచిత వైద్యం అందటంతో పాటు ఆసుపత్రులు బలోపేతం అవుతాయని సూచించారు.
108, 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు, అలనా వాహనాలు రివ్యూ చేయాలి. ఆసుపత్రుల్లో జిల్లా కలెక్టర్లు సర్ ప్రైస్ విజిట్ చేయాలని అన్నారు. ఎప్పడికప్పుడు అక్కడి పరిస్థితులను తెల్సుకోవాలని అన్నారు.
పి హెచ్ సి ల్లో వైద్యులు లేరు అనే మాట ఉండొద్దని, ముఖ్యమంత్రి గారు ఎక్కడా ఖాళీ లేకుండా వైద్యులను భర్తీ చేయాలని చెప్పారని, ఆదిశగా ప్రతి పి హెచ్ సి లో డాక్టర్ ఉండాలని. వాక్ ఇంటర్వ్యూ లో పెట్టీ అపాయింట్ చేసుకోవాలని కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
102 వాహనాలను ఎఫెక్టివ్ గా వాడాలి. గర్భిణులకు సేవలు అందించాలి. ఏ ఎన్ ఎం చేకప్స్ చేయించాలని సూచించారు.
ముఖ్యంగా సి సెక్షన్లు తగ్గించడంలో ప్రభుత్వం దృష్టి సారించింది. కలెక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని,జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సెక్షన్ల పై ఆడిట్ చేయాలని అన్నారు. తల్లి పిల్లకు నష్టం అనుకున్నపుడు మాత్రమే సెక్షన్ చేయాలని ఈ విషయంలో పెద్ద మొత్తంలో అవగాహన కల్పించాలని అన్నారు.

సి. సెక్షన్ వల్ల తల్లి, బిడ్డకు నష్టం. తల్లి, పిల్ల ఆరోగ్యం బాగుండాలంటే సి సెక్షన్లు తగ్గాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో తగ్గేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏఎన్సి చెకప్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, మాతా శిశు మరణాలు తగ్గించడం సాధ్యమవుతుందని తెలిపారు.
కేసీఆర్ కిట్స్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతానికి పెరిగిందని, ఇది మరింత పెరిగేలా కృషి చేయాలని అన్నారు. వంద శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు జరిగేలా చూడాలని అన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ.. ఆసుపత్రులకు కాయకల్ప, లక్ష్య, క్వాలిటీ అసురెన్స్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడాలని తెలిపారు.
ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, డైట్ సేవలను సమీక్షించాలి.
బడ్జెట్ లో చార్జీలను పెంచడం జరిగింది. పాత టెండర్ల గడువు పూర్తి అయిపోయింది. వెంటనే శానిటేషన్, డైట్ టెండర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
636 పీహెచ్ సి 232 అర్బన్ పి హెచ్ సి లో సి సి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి పూర్తి అయితే జిల్లా కలెక్టర్లు సైతం పరిశీలించే వెసులుబాటు ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో 18 ఏళ్లు పై బడిన వారికి,15-17 ఏళ్ల కేటగిరీ,12- 14 ఏళ్ల కేటగిరీలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు చేయాలని అన్నారు.
కొత్త మెడికల్ కాలేజీల పనులు, ఆసుపత్రి అప్ గ్రేడేషన్ పనులు వేగవంతం చేయాలని, ముఖ్యమంత్రి గారు ఈసారి మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలని చెప్పారు. ల్యాండ్ అలాట్మెంట్ ప్రతిపాదనలు త్వరగా పంపాలని సూచించారు.

వడ గాలుల విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలి.
ఆసుపత్రుల్లో తాగునీటి వసతులు ఉండేలా చూడాలని అన్నారు.

సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందిస్తున్నారు. నెలలో ఏదో ఒక రోజు కలెక్టర్లు వైద్యారోగ్యం పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలి. ఎక్కడికి వెళ్ళినా సమీపంలోని ఆసుపత్రులను సర్ప్రైజ్ విజిట్ చేయాలని సూచించారు.

సోమవారం బి అర్ కే భవన్ లో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో సిఎస్ సోమేష్ కుమార్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ వాకటి కరుణ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీ ఎం ఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని పిహెచ్సి లలో కాన్పుల జరిగేలా అలాగే ఈ నెలలో 515 ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు లు జరిగాయని తెలిపారు. ప్రవేటు ఆసుపత్రులలో సి.సెక్షన్ పై గట్టి నిఘా ఉంచామని జిల్లాలి టి.డాయగ్నిస్టిక్ ను త్వరలో జిల్లాలో ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DMHO dr. కోటా చలం, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు dr. మురళీధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ dr. శారదా , వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post