దళిత బందు లబ్ది దారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణి చేయాలి :: జిల్లా కలెక్టర్ డి హరిచందన.
శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో దళితబందు పురోగతి పై ప్రత్యెక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బందు మొదటి విడత లబ్ధిదారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణి చేయాలని ఆదేశించారు. జిల్లా లో మొదటి విడతలో 183 లబ్దిదారులను తీసుకోవడం జరిగిందని వివిధ డైరీ ఫర్టిలైజర్ మరియు సెంట్రింగ్, ఎల్స్త్రికల్ లబ్దిదారులు ఎంచుకున్ను యూనిట్లను యంపిడిఓ లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వం వహిస్తున్నందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్లో లబ్ది దారులకు పంపిణి చేయవలసినవి త్వరగా పంపిణి చేయాలనీ సమీక్షా సమావేశం లో అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా యస్సీ సెల్ యిడి హరినాథ్ రెడ్డి, జాన్ సుధాకర్, గోపాల్ నాయక్, జ్యోతి, యంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.