వార్త ప్రచురణ
జనవరి 22,2022(శనివారం)
ములుగు జిల్లా :
దళితబంధు అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నివహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ దళితబంధు అమలును వేగవంతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్.సి. కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుండి సి.ఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సి.ఎం. కార్యాలయం కార్యదర్శి, ఎస్.సి. అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్.సి కార్పొరేషన్ ఎం.డీ. కరుణాకర్ లు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దళిత బంధు అమలుపై ఈ క్రింది ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు జారీ చేయడం జరిగింది.
* రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో ఈ పధకం అమలు చేయాలని నిర్ణయం.
* ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 100 శాతం గ్రౌండింగ్ చేయాలి.
* స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ఆమోదింపచేయాలి.
*ప్రతీ లబ్ది దారుడికీ ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందచేత.
*లబ్ది దారుడు కోరుకున్న యూనిట్ నే ఎంపిక చేయాలి.
*ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన రూ.10 లక్షలనుండి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలి.
*దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకం.
*ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బందుకు రూ. 1200 కోట్ల కేటాయింపు. ఇప్పటికే రూ. 100 కోట్లను విడుదల చేసాం.
*విడతల వారీగా మిగతా నిధుల విడుదల.
*ఇప్పటికే, వాసాల మర్రి, హుజురాబాద్ లలో దళిత బంధు అమలు లో ఉంది.
*ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా అమలు చేస్తున్నమని అన్నారు. దళిత బంధు పథకం అమలుకు జిల్లాల వారిగా సమగ్ర సర్వే నిర్వహించి ఒక్కొక్క జిల్లాకు 100 మంది చొప్పున దళిత బంధు బెనిఫిషరిస్ ను ఎంపిక చేయుటకు ఈ రోజు మార్గనిర్దేశాలను ,సలహాలు, సూచనలు చేయుటకు కరీంనగర్ నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , హైదరాబాదు నుండి ఎస్ సోమేశ్ కుమార్, ఎస్.సి. అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కల్లెక్టర్స్ తో సమీక్షా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ నియోజక వర్గం ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వ ఆదేశాల మేరకు నివేదికలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (LB) ఇలా త్రిపాఠీ, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ది శాఖ అధికారి భాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు