దశబ్ది ఉత్సాహాలు జిల్లా లో ఘనంగా నిర్వహించాలి MLA యస్ రాజేందర్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి పది సవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా లో దశబ్ది ఉత్సాహాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్ని భుడవరం సాయంత్రం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశం లో అధికారులకు స్థానిక శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి అదీశించారు. రాష్టం ఏర్పాటు అయినపటి నుండి నేటివరకు జిల్లా లో సాదించిన అభిరుద్ది పనుల పై ప్రజలకు తెలిసేటట్లు శాఖల పరంగా సభలు సమావేశలు నిర్వహించాలన్నారు. అన్ని రంగాల్లో జరిగిన ప్రగతి చాటేలా జిల్లాలో పండగ వాతావరణం లో ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9 సంవత్సరాల స్వయం పాలన పూర్తి చేసుకోని 10వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు వైభవంగా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.