దశాబ్ది ఉత్సవాలను పగడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలి
రైతు వేదికల కేంద్రంగా రైతు దినోత్సవం నిర్వహణ
జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
00000
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణపై వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఇరిగేషన్, సహకార, పశుసంవర్ధక శాఖ, పౌరసరఫరాల శాఖ, ఎంపీడీవోలు లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి రోజూ నిర్వహించు కార్యక్రమాలను ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని, కార్యక్రమం మొదలు నుంచి ముగింపు వరకు ప్రతి అంశాన్ని ముందుగా ఎవరు, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే అంశం నిర్ధారించుకొని, విధులను కేటాయించుకొని, ఎటువంటి లోటు పాట్లు లేకుండా, ప్రశాంతంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని, కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి కార్యక్రమంతో పాటు, ప్రత్యేకంగా జూన్ 3న రైతు దినోత్సవం, జూన్ 7న సాగునీటి దినోత్సవం, జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 76 రైతు వేదికలలో రైతు దినోత్సవం నిర్వహించాలని, కార్యక్రమానికి రైతువెదికలను శభ్రంచేసి మామిడి తోరణాలు, పూలతో అలకరించాలని. ఎంపిడిఓ, ఎంపిఓ, తహసిల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించాలని, కార్యక్రమ నిర్వహణ గురించి పాంప్లెంట్స్ ద్వారా తెలియజేయాలని అన్నారు. రైతు వేదిక క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులను ట్రాక్టర్, ఎడ్ల బండ్లలో ర్యాలీగా ఉదయం రైతు వేదికలను చేరుకోవాలని, వ్యవసాయ శాఖలో సాధించిన ప్రగతి గ్రామాల వారీగా రైతులకు తెలియజేయాలని, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ మొదలగు వివిధ పథకాల ద్వారా ప్రతి రైతుకు జరుగుతున్న లబ్ది, యాసంగి లో ముందస్తు సాగు ప్రణాళిక, ఆయిల్ పామ్ సాగు కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సీడీలపై ప్రొజెక్టర్ల ద్వారా, పథకాల ద్వారా లబ్దిపొందిన రైతులు, కాళేశ్వరం ప్రాజేక్టు ద్వారా లభించిన సమృద్దిగా అందుతున్న నీరు తదితర అంశాలపై స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. రైతువేదికల వద్ద బ్యానర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. రైతుబంధు సమితి సభ్యులతో సమన్వయం చేసుకుంటూ రైతులను సమీకరించాలని, క్లస్టర్ వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని, రైతు వేదిక దగ్గర ఏర్పాట్లు ప్రత్యేకంగా పరిశీలించాలని, పరిసరాల పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, ఎక్కడా తోపులాటలు జర్గకుండా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ తెలిపారు. భోజనం సుచి,శుభ్రతతో రుచిగా ఉండాలని అన్నారు.
జూన్ 7న సాగునీటి దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో వేడుకలు నిర్వహించాలని, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు ఘనంగా చాటాలని కలెక్టర్ తెలిపారు. జూన్ 8న నిర్వహించు ఊరూరా చెరువుల పండుగ కోసం ప్రజా ప్రతినిధులను సంప్రదించి ప్రతి గ్రామంలో పెద్ద చెరువు ఎంపిక చేయాలని, చెరువు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో వేడుకలు, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని , బతుకమ్మ, బోనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించాలని, కట్ట మైసమ్మ పూజ చేయాలని కలెక్టర్ తెలిపారు. చెరువు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన మార్పు, పెరిగిన మత్స్య సంపద, పంటలు విస్తిర్ణం తదితర అంశాలపై స్పష్టంగా వివరించాలని అన్నారు.
ఊరూరా చెరువుల పండుగ నిర్వహణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచుకోవాలని, దశాబ్ది వేడుకల ప్రతి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రికార్డు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, శిక్షణ జాయింట్ కలెక్టర్ నవీన్ నికోలస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, ఈఈ ఇరిగేషన్ శివ ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, పిడి ఆత్మ ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.