ప్రచురణార్థం…..1
తేదీ.01.06.2023
దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన::జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 01:
ప్రణాళికాబద్ధంగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీసి చాంబర్ నందు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ట్.ఎస్.దివాకర, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లతో కలిసి సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి రోజూ నిర్వహించు కార్యక్రమాలను ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని, కార్యక్రమం మొదలు నుంచి ముగింపు వరకు ప్రతి అంశాన్ని ఎవరు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే అంశం నిర్ధారించుకొని, విధులను కేటాయించుకొని, ఎటువంటి లోటు పాట్లు లేకుండా, ప్రశాంతంగా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని, కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం కనబర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
*జిల్లాలో ఉన్న 45 రైతు వేదికలలో రైతు దినోత్సవం నిర్వహించాలని, వ్యవసాయ అధికారులు, ఎంపిడిఓ, ఎంపిఓ, తహసిల్దార్, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించాలని అన్నారు
రైతు వేదిక క్లస్టర్ పరిధిలో ఉన్న 3, 4 గ్రామాల నుంచి రైతులను ట్రాక్టర్, ఎడ్ల బండ్లలో ర్యాలీ లాగా ఉదయం 10 గంటల లోపు రైతు వేదికలను చేరుకోవాలని, వ్యవసాయ శాఖలో సాధించిన ప్రగతి గ్రామాల వారీగా రైతులకు తెలియ జేయాలని, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ మొదలగు వివిధ పథకాల ద్వారా ప్రతి రైతుకు జరుగుతున్న లబ్ది, యాసంగి లో ముందస్తు సాగు ప్రణాళిక, ఆయిల్ పామ్ సాగు కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సీడీల పై ప్రత్యేకంగా వివరించాలని కలెక్టర్ తెలిపారు.
రైతుబంధు సమన్వయ సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల తో సమన్వయం చేసుకుంటూ రైతులను సమీకరించాలని, క్లస్టర్ వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలని, రైతు వేదిక దగ్గర ఏర్పాట్లు ప్రత్యేకంగా పరిశీలించాలని, పరిసరాల పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, ఎక్కడా తోపులాటలు జర్గకుండా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ తెలిపారు. భోజనం సుచి,శుభ్రతతో రుచిగా ఉండాలని, ఓపికతో ఉండే వారు వడ్డించేలా చూడాలని అన్నారు.
బతుకమ్మ, బోనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించాలని, కలెక్టర్ తెలిపారు.
దశాబ్ది వేడుకలలో ప్రతి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ రికార్డు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ లు, ఎం.పి. ఓ లు, ఏ. ఓ.లు, ఏ. ఈ. ఓలు, , తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.