ప్రచురణార్థం
మహబూబాబాద్ మే 29.
దశాబ్ది వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
అసవరం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నందున రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో దశాబ్ది వేడుకల నిర్వహణ ఏర్పాట్లు తీరుతనులపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక నివేదిస్తూ… గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రణాళిక బద్ధంగా అధికారులను నియమించమని ప్రతి కార్యక్రమాన్ని పండుగలు నిర్వహిస్తామని చెప్పారు.
జిల్లాలో 82 రైతు వేదికలు ఉన్నాయన్నారు మామిడి తోరణాలతో ముగ్గులతో రంగ రంగ వైభవంగా అలంకరించడం జరుగుతుందని చెప్పారు.
గ్రామాలలో ప్రజా ప్రతినిధులు రైతుల సహకారంతో ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు అలంకరింపజేసి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు రైతు బీమా లబ్ధిదారులను గుర్తించి రైతు వేదికలలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు సభల నిర్వహణ భోజనాలు సాంస్కృతిక కార్యక్రమాలు విభజన చేసి నిర్వహణకై అధికారుల కు అప్పజెప్పమన్నారు.
రైతు దినోత్సవం సాగునీటి దినోత్సవం చెరువుల పండగ తెలంగాణ న్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మంచినీళ్ల పండగ హరితోత్సవం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేపడతామన్నారు.
సాంస్కృతి కార్యక్రమాలు లలో కోలాటం గిరిజన నృత్యాలు బోనాలు బతుకమ్మలు డప్పుల విన్యాసం ముగ్గుల కార్యక్రమం మామిడి తోరణాలు వంటి కార్యక్రమాలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొల్పుతామన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో ఉత్తమంగా రాణించిన ఉద్యోగులను సన్మానించ డం జరుగుతుందని తెలిపారు.
సఫాయి అన్న సలాం అన్న అనే నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా పారిశుద్ధ కార్మికుల ను సన్మానించుకోవడం జరుగుతుందన్నారు.
పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో గ్రామపంచాయతీలలో జాతీయ జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. అమరవీరుల త్యాగాలను పాఠశాలల్లో విద్యార్థులకు బోధింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తామని ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై వీడియో ఫోటోలు తీయించి నివేదికల ద్వారా సమర్పిస్తామన్నారు.
అనంతరం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ జిల్లాలో పండుగ వాతావరణం కనిపించాలని దశాబ్దకాల అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ శరత్ చంద్ర పవర్ అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ డేవిడ్ జడ్పీ సీఈవో రమాదేవి డిఆర్డిఏ పిడి సన్యాసయ్య ఆర్డీవోలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.